అక్షరటుడే, వెబ్డెస్క్ : Deputy CM CPRO | ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ మృతి చెందాడు. గుండెపోటుతో ఆయన సోమవారం అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
మధుసూదన్ గతంలో ఈనాడు (Eenadu), ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా పని చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం సీపీఆర్వోగా నియమితులయ్యారు. సోమవారం మధ్యాహ్నం చాతి నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో కార్డియాక్ అరెస్టు కావడంతో సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స నిర్వహిస్తున్న సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
Deputy CM CPRO | భట్టి దిగ్భ్రాంతి
మధుసూదన్ మృతి పట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాయితీ గల పాత్రికేయన్ని కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Deputy CM CPRO | నివాళి అర్పించిన పొన్నం
మధుసూదన్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మధుసూదన్ విద్యార్థి దశ నుంచి తనకు మంచి మిత్రుడని గుర్తు చేశారు. ఆయన మధుసూదన్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
దీనిని కూడా చదవండి : Police Leave Policy | పోలీసులకు గుడ్న్యూస్.. ఆ రెండు రోజులు లీవ్


[…] ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని (Deputy CM Bhatti Vikramarka) మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని […]