అక్షరటుడే, వెబ్డెస్క్: ACB Raid | తెలంగాణ (Telangana)లో ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతికి పాల్పడుతున్న అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుంటోంది. ఇటీవల చాలా మంది అధికారులు అనిశాకు పట్టుబడ్డారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఏమాత్రం భయం లేకుండా లంచాలు తీసుకుంటున్నారు. తాజాగా.. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికారు.
ACB Raid | రూ. 10 లక్షలు డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District)లో బీటీ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కొన్ని చెట్లు తొలగించారు. దీంతో కేసు నమోదు చేయకుండా ఉండడం కోసం భద్రాచలం అటవీశాఖ ఎఫ్డీవో సుజాత రూ.పది లక్షలు డిమాండ్ చేశారు. అయితే ఈ క్రమంలో రూ. 3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు (ACB Officers) సుజాతతో పాటు చర్ల ఇన్ఛార్జి డీఆర్వో కృష్ణయ్యను పట్టుకున్నారు.
ACB Raid | రోడ్డు పనులు చేస్తుండగా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో చెట్లు దెబ్బ తిన్నాయి. దీంతో ఎఫ్డీవో సుజాత రంగంలోకి దిగి చెట్లు తొలగించడంతో కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించారు. భద్రాచలం కార్యాలయంలో అటవీ అధికారులు రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది.
ఇది కూడా చదవండి..: Metro Phase 2 | మెట్రో ఫేజ్–2కు ఆమోదం తెలపాలి.. కేంద్ర మంత్రిని కోరిన సీఎం

