అక్షరటుడే, కామారెడ్డి: Bus Stand Theft | కామారెడ్డి బస్టాండ్ (Kamareddy bus stand) దొంగలకు అడ్డాగా మారుతోంది. బస్టాండ్లో ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నారు. బస్సులో ఎక్కేందుకు నిలబడ్డ ప్రయాణికుల్లో కలిసిపోయి చోరీలకు తెగబడుతున్నారు.
Bus Stand Theft | కామారెడ్డి బస్టాండ్లో..
తాజాగా కామారెడ్డి(Kamareddy) కొత్త బస్టాండ్లో ఓ మహిళా ఉద్యోగి బ్యాగు చోరీకి గురైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. మేడ్చల్కు చెందిన ఓ మహిళా ఉద్యోగి కామారెడ్డి పట్టణంలోని ఓ శుభకార్యం నిమిత్తం వచ్చింది. సాయంత్రం ఫంక్షన్ ముగించుకుని బస్టాండ్లో ఆమె తన తల్లిని నిజామాబాద్ బస్ ఎక్కిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె బ్యాగ్ను దొంగిలించుకుని పారిపోయాడు. దొంగ పారిపోయాక గమనించిన మహిళ తన బ్యాగు చోరీకి గురైందని గుర్తించింది. వెంటనే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా బస్టాండ్కు చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా విచారణ చేపడుతున్నారు. చోరీకి గురైన బ్యాగులో 5 తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు ఉన్నట్టు మహిళ తెలిపింది.

