అక్షరటుడే, వెబ్డెస్క్: Bandi Bhagirath POCSO Case | బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం మీడియా చిట్చాట్లో మాట్లాడారు.
బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు అంశంపైన డీజీపీ ,ఇతర అధికారులతో సమీక్ష చేశానని సీఎం చెప్పారు. భగీరథ్పై పేట్ బషీరాబాద్ స్టేషన్లో అమ్మాయి తల్లి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ నెల 8న సంజన్ కొడుకుపై ఎఫ్ఐఆర్ నమోదు అయిందని వెల్లడించారు. అంతకు ముందే కరీంనగర్లో బండి సంజయ్ కుమారుడు వాళ్ల పైన కేసు పెట్టారన్నారు.
Bandi Bhagirath POCSO Case | ప్రధాని పర్యటనతో ..
ప్రధాని మోదీ (Prime Minister Modi) పర్యటనతో ఈ నెల 9,10 తేదీల్లో 10 వేల మంది పోలీసులు భద్రతలో నిమగ్నమయ్యారని సీఎం తెలిపారు. డీజీ నుంచి కింద స్థాయి అధికారుల వరకు అంతా ఈ భద్రతలోనే ఉన్నారని చెప్పారు. దీంతో కేసు విచారణ ఆలస్యం అయిందన్నారు. ఇప్పుడు విచారణ ప్రారంభమైందని, పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
Bandi Bhagirath POCSO Case | క్షణాల్లో ఏదీ జరగదు
బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద జరగదని సీఎం పేర్కొన్నారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అన్న విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. సీనియర్ ఉమెన్ ఆఫీసర్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి చేయాలని డీజీపీని ఆదేశించినట్లు తెలిపారు. బాధితులను స్టేట్మెంట్ తీసుకుని చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు.
Bandi Bhagirath POCSO Case | ఆర్ఎస్ ప్రవీణ్పై విమర్శలు
ఖాళీగా ఉన్నామని కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డ్యూటీ చేస్తామంటే ఎలా అని సీఎం ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఈ ఫిర్యాదు పైన విచారణ జరిపితే ప్రభాకర్ రావు నీతిమంతుడు అని ఆయనే చెప్పారన్నారు. అది ఆయన నీతి అని ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ కమిషనర్కు ఇవ్వాలని సూచించారు. బాలికకు సంబంధించిన అంశంలో అంతా బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Bandi Sanjay Son POCSO Case | బండి సంజయ్ కుమారుడిపై కేసు.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

