Kamareddy Railway Court | కవితకు షాక్​ ఇచ్చిన రైల్వే కోర్టు.. విచారణకు రావాలని ఆదేశం..

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Railway Court | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కామారెడ్డిలో రైల్ రోకోకు దిగిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)కు రైల్వే కోర్టు షాకిచ్చింది. ఈ కేసులో బుధవారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది.

Kamareddy Railway Court | నవంబర్​ 28న కామారెడ్డిలో..

కామారెడ్డి జిల్లా (Kamareddy District) కేంద్రంలో గతేడాది నవంబర్ 28న బీసీ బిల్లులకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ కవిత ఆధ్వర్యంలో రైల్ రోకో నిర్వహించారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేవరకు ఉద్యమం ఆగదని ఆమె హెచ్చరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవితతో పాటు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ రైల్ రోకో కారణంగా సిర్నపల్లి-ఇందల్వాయి మధ్య నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఓ గూడ్స్ రైలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి రైల్వే ఏఎస్సై రవీంద్ర బాబు (Kamareddy Railway ASI Ravindra Babu) ఫిర్యాదు మేరకు కవితతో సహా 12 మంది టీఆర్ఎస్ నేతలపై రైల్వే చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.

Kamareddy Railway Court

ఇది కూడా చదవండి..: NEET Exam Cancellation | ‘నీట్’ రద్దు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే..: బొబ్బిలి రామకృష్ణ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *