తెలంగాణStreenidhi | స్త్రీనిధితో మహిళల ఆర్థిక స్వావలంబన : మంత్రి సీతక్క

Streenidhi | స్త్రీనిధితో మహిళల ఆర్థిక స్వావలంబన : మంత్రి సీతక్క

మహిళల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో మాట్లాడారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Streenidhi | ప్రజాభవన్‌లో స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్త్రీనిధి సంస్థ మన ఇల్లు లాంటిదన్నారు. సంస్థను కాపాడుకుంటేనే ఉద్యోగుల హక్కులు, భవిష్యత్తు సురక్షితంగా ఉంటాయని చెప్పారు. 2011లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రారంభించిన స్త్రీనిధి, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరింత బలోపేతం అవుతోందన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు, అధిక వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్న మహిళలను ఆదుకోవడానికే స్త్రీనిధి ఏర్పాటు చేశామని తెలిపారు.

Streenidhi | రూ. 24 వేల కోట్ల రుణాలు

ఇప్పటివరకు స్త్రీనిధి ద్వారా 32 లక్షల మందికి పైగా మహిళలకు రూ.24 వేల కోట్ల రుణాలు అందించినట్లు మంత్రి పేర్కొన్నారు. స్త్రీనిధి అస‌లు సిస‌లు మాహిళా బ్యాంక్ అని కొనియాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లక్ష్యమన్నారు. ఆ దిశగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. కొంతమంది సంస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 16 మంది ఉద్యోగులను తొలగించారని, ఇప్పుడు అదే వ్యక్తులు తప్పుడు ఆరోపణలతో సంస్థను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

Streenidhi | ఒక్కరిని కూడా తొలగించం

తమది ఉద్యోగ అనుకూల ప్రభుత్వమని సీతక్క తెలిపారు. స్త్రీనిధిలో ఒక్క‌రిని కూడా తొల‌గించ‌లేదని చెప్పారు. ఇప్పటికే పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామని పేర్కొన్నారు. స్త్రీనిధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. స్త్రీనిధి సంస్థ ఏర్పాటులో, దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేసిన ఎండీ విద్యాసాగర్ రెడ్డిని మంత్రి అభినందించారు.

ఇది కూడా చదవండి..: Bandi Bhagirath Case | బండి భగీరథ్​పై లుక్‌ అవుట్ నోటీసులు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్, అక్రమ కల్లు లైసెన్స్ ఆరోపణలపై ఇద్దరికి నోటీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్ సమర్పించి...

CBSE Three Language Rule | CBSC బోర్డు కీలక నిర్ణయం.. 9, 10 తరగతులకు కొత్త త్రీ-లాంగ్వేజ్ రూల్..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CBSE Three Language Rule | సీబీఎస్ఈ బోర్డు...

BalBhavan Nizamabad | చిన్నారుల్లో సృజనాత్మకతకు వెలికితీయడంలో బాల్​భవన్​ పాత్ర గొప్పది: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BalBhavan Nizamabad | చిన్నారుల్లో సృజనాత్మకతకు వెలికితీయడంలో...

Drug Abuse Awareness | మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Drug Abuse Awareness | మత్తు పదార్థాలు...