అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్ లైన్మన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి (Yadadri) జిల్లాలో చోటు చేసుకుంది.
భువనగిరి జిల్లా మోటకొండూరుకు చెందిన టీజీఎస్పీడీసీఎల్ (SPDCL) అసిస్టెంట్ లైన్మ్యాన్ పప్పుల రమేష్ ఓ వ్యక్తి బోర్వెల్కు విద్యుత్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేశాడు. స్తంభాలు పాతడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ అమర్చడానికి మొత్తం రూ.35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు శనివారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.35 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అసిస్టెంట్ లైన్మన్ పప్పుల రమేశ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ACB Trap | జోరుగా అవినీతి
రాష్ట్రంలో అన్ని శాఖల్లో జోరుగా అవినీతి సాగుతోంది. కొందరు అధికారులు లంచాలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. విద్యుత్ శాఖలో అయితే కొందరు లైనమన్లు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నూతన మీటర్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. బోరుబావుల వద్ద ట్రాన్స్ఫార్మర్లు పాడైన పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్సైట్ ద్వారా కంప్లైట్ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
దీనిని కూడా చదవండి : Revanth Reddy Convoy | నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం


