అక్షరటుడే, ఇందూరు: Naikpod Merit Awards | ప్రతి ఏడాదిలాగే ఆదివాసి నాయకపోడ్ విద్యార్థులకు ఈసారి కూడా ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు నాయకపోడ్ సేవా సంఘం జిల్లా(Nizamabad) అధ్యక్షుడు గాండ్ల రాంచందర్ తెలిపారు.
ఈ మేరకు ఆదివారం ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో జిల్లా నాయకపోడ్ (Naikpod) ఉద్యోగుల సేవా సంఘ అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Naikpod Merit Awards | ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సదస్సు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ఆదివాసి నాయకపోడ్ విద్యార్థులకు, యువకులకు విద్య, ఉద్యోగ(Employment Guidance), ఉపాధి అవకాశాల మీద చైతన్య సదస్సు(Tribal Welfare) నిర్వహించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ఎస్సెస్సీ ఇంటర్, ఉన్నత విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులను సైతం పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. పెర్కిట్లోని భీమన్న దేవుని కల్యాణ మండలంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.
నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల సేవా సంఘం, జిల్లా సేవా సంఘం సహకారంతో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Bhageerath POCSO Case | బండి భగీరథ్ కేసు.. 14 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు


