అక్షరటుడే, వెబ్డెస్క్:Telangana Rain Alert | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. అయితే రెండు రోజులుగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సైతం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ (Nizamabad), నారాయణపేట్, మహబూబ్నగర్ జిల్లాల్లో నేడు సాయంత్రం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి ఎల్లారెడ్డి నియోజకవర్గం (Yellareddy Constituency)లో అనేక చెట్లు కూలిపోయాయి. మెదక్ జిల్లాల్లో సైతం భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
Telangana Rain Alert | మండుతున్న ఎండలు
రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నా.. ఎండ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. వర్షాలతో గాలిలో తేమ ఎక్కువై ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో నేడు ఎండతీవ్రత అధికంగా ఉండనుంది. ఆయా జిల్లాల్లో 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయ్యే ఛాన్స్ ఉంది. హీట్వేవ్ కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: International Museum Day | మ్యూజియాలు జీవన విధానానికి జ్ఞాన కేంద్రాలు – మంత్రి జూపల్లి


