అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట మండల తహశీల్దార్ (Shamirpet Tahsildar) సుచరిత లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ కోసం ఆమె రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏసీబీ (ACB) అధికారులు కేసు వివరాలు వెల్లడించారు.
శామీర్పేట తహశీల్దార్ సుచరిత (Tahsildar Sucharita) మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులకు (ACB Raid ) చిక్కారు. 30 ఎకరాల వ్యవసాయ భూమిని నాలాగా మార్చే దరఖాస్తులను పరిశీలించి, ఆమోదించడం కోసం ఆమె ఏకంగా రూ.30 లక్షల లంచం డిమాండ్ చేసింది. తన ప్రైవేట్ డ్రైవర్ వి నాగేశ్ ద్వారా మంగళవారం రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు. రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్ సుచరిత, ఆమె డ్రైవర్ నాగేశ్ను అరెస్ట్ చేశారు. వారిని నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
ACB Raid | అవినీతి కేంద్రాలుగా..
రాష్ట్రంలోని తహశీల్దార్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. పలువురు తహశీల్దార్లు ప్రజల నుంచి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజా కేసులో నాలా మార్పిడి కోసం రూ.30 లక్షల లంచం డిమాండ్ చేసిందంటే ఆమె గతంలో ఎంత మొత్తం వసూళ్లకు పాల్పడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఏసీబీ కేసుల్లో చిక్కిన వారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసి.. ఆస్తులను జప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వారిని పూర్తిగా ఉద్యోగంలో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
# ACB, Ranga Reddy Range
# Smt. T. Sucharitha, Tahsildar & Executive Magistrate, Shamirpet Mandal was caught red-handed on 26.05.2026 at 2:00 PM.# Demanded ₹30 lakh bribe, accepted ₹2 lakh as part payment through her driver V. Nagesh for NALA conversion of 30 acres agrl land pic.twitter.com/COBlKPNOKC
— ACB Telangana (@TelanganaACB) May 26, 2026
దీనిని కూడా చదవండి : Bandi Bhagirath Custody | బండి భగీరథ్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి


