Army Regiment Theft | ఆర్మీ రెజిమెంట్​లో చోరీ.. ఏకే 47 సహా 12 ఆయుధాలు మిస్సింగ్​

హైదరాబాద్​ నగరంలోని మద్రాస్ రెజిమెంట్ నుంచి 12 ఆయుధాలు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Army Regiment Theft | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో అత్యంత భద్రత ఉంటే మద్రాస్ రెజిమెంట్ నుంచి 12 ఆయుధాలు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. ఆయుధాలను భద్రపరిచిన గది తాళాన్ని పగలగొట్టి వాటిని తీసుకువెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సైనిక అధికారులు బొల్లారం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

కంటోన్మెంట్ ప్రాంతంలో ఆర్మీకి అనుబంధంగా అనేక రెజిమెంట్లు ఉన్నాయి. అందులో మద్రాస్​ రెజిమెంట్ కూడా ఒకటి. సైనిక సిబ్బంది ఆయుధాలను నిల్వ చేసే ఒక విభాగం ఇక్కడ ఉంది. ఇందులోకి అందరికి ప్రవేశం ఉండదు. అలాంటి ఆయుధ గదిలో చోరీ జరగడం ఆందోళన కలిగిస్తోంది. నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఆరు పిస్టళ్లు, ఒక (ఇన్సాస్) రైఫిల్, మందుగుండు సామగ్రి ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. సీనియర్ ఆర్మీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Army Regiment Theft | సిబ్బందే చేశారా..

ఆ ప్రాంతంలోకి బయటికి వ్యక్తులకు ప్రవేశం ఉండదు. భారీ భద్రత ఉంటుంది. దీంతో రెజిమెంట్​లో పని చేసే సిబ్బంది ప్రమేయం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆర్మీ అధికారులు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీకి సంబంధించిన కేసు కావడంతో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు చెందిన సీనియర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Moosarambagh Bridge | విశ్వనగరంగా హైదరాబాద్​ : సీఎం రేవంత్​రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *