అక్షరటుడే, వెబ్డెస్క్ : Banakacharla Project | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
గోదావరి జలాలను కృష్ణా నది ద్వారా రాయలసీమకు తరలించడానికి ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ను ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ నిబంధనలకు విరుద్ధంగా లిస్ట్ అయిందని కోర్టు తెలిపింది. ఒరిజినల్ సూట్ రూల్స్ ప్రకారమే విచారణ జరగాలని స్పష్టం చేసింది. ముందుగా చాంబర్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.
Banakacharla Project | లోపాలు సరిచేశాకే..

ప్రతివాదులకు నోటీసులు లేకుండానే బెంచ్ ముందుకు పిటిషన్ రావడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. అయితే ఏపీకి వెంటనే నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ విజ్ఞప్తిని తిరస్కరించింది. పిటిషన్లో లోపాలు సరిదిద్దాకే విచారణ చేపడుతామని తెలిపింది. ఈ కేసులో 15 మంది ప్రతివాదులు ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే పిటిషన్లో లోపాలు సరిదిద్దాకే మిగతా అంశాలు పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..: Albendazole Tablets | చిన్నారులకు ఆల్బండజోల్ మాత్రలు వేయాలి: మంత్రి రాజనర్సింహ