అక్షరటుడే, ఇందూరు: Basketball Team | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11వ రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ (Basketball) పోటీలు జరుగనున్నాయి. నగరంలోని కాకతీయ ఒలింపియాడ్కు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు.
Basketball Team | విద్యార్థులకు అభినందన
కాకతీయ ఒలింపియాడ్కు (Kakatiya Olympiad) చెందిన క్రీడాకారిణులు బర్కుంట హాసిని, వంశికలు తమ ప్రతిభతో బాస్కెట్బాల్ జట్టుకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయిలో చూపిన ప్రతిభ ఆధారంగా వారు జట్టులో స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా వీరిని పాఠశాల డైరెక్టర్ రజనీకాంత్, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, కోచ్ అరుణ్ అభినందించారు. కాగా కోచ్ విశాల ఆధ్వర్యంలో జిల్లా జట్టు జయశంకర్ భూపాలపల్లికి బయలుదేరి వెళ్లింది. మూడు రోజులపాటు అక్కడ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్న జిల్లాజట్టుకు నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ శుభాకాంక్షలు తెలిపింది.


ఇది కూడా చదవండి: Ponguleti Key Comments | ఏ శాఖ ఇచ్చిన పని చేస్తా.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
