అక్షరటుడే, అనకాపల్లి: Bhogapuram Airport | ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జులై మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఉత్తరాంధ్రను పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల పరంగా అగ్రగామిగా నిలబెడతామని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రధాన ప్రకటనలు ఇవే:
ప్రాజెక్టులు గడువులోపే పూర్తి: ఉత్తరాంధ్ర పరిధిలోని పోర్టులు, ఎయిర్పోర్టులు, జాతీయ రహదారులు , సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశించుకున్న గడువులోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Bhogapuram Airport | తాగునీటి కష్టాలు:
ఈ జూన్ నెలలో వర్షాలు కురవగానే ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి (Anakapalli) ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. దీనివల్ల స్థానిక సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు.
ఉపాధి అవకాశాలు: ప్రాంతానికి భారీగా పరిశ్రమలు వస్తున్నాయని, దీనివల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి..: YSRCP Criticism | వైసీపీ శవరాజకీయాలు చేస్తుంది.. జగన్ నిర్ణయాల వల్ల బీసీలు, దళితులు నష్టపోతున్నారంటూ మంత్రి విమర్శలు

