అక్షరటుడే, బోధన్: Bodhan Railway Inspection | బోధన్ రైల్వేస్టేషన్ను (Bodhan railway station) హైదరాబాద్ డివిజన్ (Hyderabad Division) రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) (Railway DRM) సంతోష్ కుమార్ వర్మ గురువారం తనిఖీ చేశారు. సాంకేతిక నిపుణులు, వివిధ విభాగాల అధిపతుల బృందంతో కలిసి వచ్చిన ఆయన స్టేషన్లో మౌలిక సదుపాయాలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యాలు, గూడ్స్ యార్డు ఏర్పాటు, భద్రతా అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.
Bodhan Railway Inspection | గూడ్స్ యార్డు కోసం ప్రణాళిక..
ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ.. స్టేషన్ను గూడ్స్ యార్డు (Goods Yard) కోసం పునర్నిర్మాణం చేసేందుకు ప్రణాళికను రూపొందింస్తున్నామని.. ఈ క్రమంలో ఇక్కడి సదుపాయాలను నిశితంగా పరిశీలించామన్నారు. గూడ్స్ యార్డు నిర్మాణం ద్వారా ఇక్కడి నుంచి సరుకు సరఫరాను మెరుగు పర్చేందుకు సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ట్రాక్ లేఅవుట్లను, అందుబాటులో ఉన్న భూమిని పరిశీలించి బ్లూప్రింట్ను సిద్ధం చేశామని వివరించారు.
ఈ సందర్భంగా నిత్యావసర వస్తువుల రవాణాను క్రమబద్ధీకరించడం, ఈ ప్రాంతంలో పరిశ్రమలు, వ్యవసాయ వాణిజ్యానికి బోధన్ను (Bodhan) కీలకమైన లాజిస్టిక్స్ నోడ్గా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఉన్నత స్థాయి తనిఖీలో రైల్వే ఉన్నతాధికారులు దుర్గాప్రసాద్, హేమనాయక్, ప్రశాంత సాయికృష్ణ, విజయ్కుమార్, శశాంత్ నామ్దేవ్, లక్ష్మీనారాయణ, విద్యాధర్, అనిరుధ్ పమార్, సృజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: RTC Strike | తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. ఆర్టీసీ కార్మికులకు సీఎం విజ్ఞప్తి

