అక్షరటుడే, వెబ్డెస్క్ : Borewell Rescue Tragedy | బోరుబావిలో పడిన మనవడిని కాపాడటానికి వెళ్లిన తాత మృతి చెందాడు. ఈ విషాధ ఘటన నల్గొండ జిల్లా (Nalgonda District) మిర్యాలగూడ మండలంలో చోటు చేసుకుంది.
మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామానికి (Ootlapalli Village) చెందిన వెంకన్న (53) ఉప సర్పంచ్గా కొనసాగుతున్నారు. ఆయన శనివారం ఉదయం తన నాలుగేళ్ల మనవడితో కలిసి వ్యవసాయ పొలం వద్ద మామిడి చెట్లకు నీరు పట్టడానికి వెళ్లాడు. అయితే అక్కడ రన్నింగ్లో ఉన్న బోరు కుంగిపోయింది. వెంకన్న మనవడు ఆడుకుంటూ వెళ్లి ఆ బోరు బావిలో పడిపోయాడు. గమనించిన వెంకన్న కాపాడాటానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన కూడా బావిలో పడిపోయారు.

Borewell Rescue Tragedy | రెస్క్యూ ఆపరేషన్
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఓ వ్యక్తికి తాడు కట్టి లోనికి పంపించారు. ఆ వ్యక్తి మొదట వెంకన్నను బయటకు తీశాడు. అనంతరం బాలుడిని రక్షించాడు. అయితే వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో వెంకన్న చనిపోయాడు. బాలుడు మాత్రం సురక్షితంగా బయట పడ్డాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: FCI Godown Fire | FCI గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు


