అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : BRS Dharna | ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా (Bigala Ganesh Gupta) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరనస తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, 13 డిక్లరేషన్ లు, 6 గ్యారెంటీల పేరుతో నమ్మించి అధికారంలోకి వచ్చిందన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి వెయ్యి రోజులు పూర్తి అయిన ఇప్పటి దాకా ఒక్క హామీ పూర్తి కాలేదని మండిపడ్డారు. వెంటనే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
BRS Dharna | తులం బంగారం ఇవ్వాలి
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు మహిళలకు ప్రతి నెలా రూ.2500, కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం ఇవ్వాలని బిగాల డిమాండ్ చేశారు. ప్రతి పంటకు రైతు భరోసా, కొరత లేకుండా ఎరువుల పంపిణీ, పంటలకు బోనస్, 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందించాలన్నారు. అర్హులైన నిరుద్యోగ యువతకు, నిరుద్యోగ భృతి, ఉద్యోగం, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Municipal Worker Protest | వాటర్ ట్యాంక్ ఎక్కి మున్సిపల్ కార్మికుడి నిరసన