అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Municipal Worker Protest | నిజామాబాద్ (Nizamabad) నగరంలో ఓ మున్సిపల్ కార్మికుడు నిరసన తెలిపారు. తమను వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్పొరేషన్లో వాటర్ వర్క్స్ విభాగంలో పని చేస్తున్న యూసుఫ్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం జోన్ –2 కార్యాలయం గోల్ హనుమాన్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. తమను వేధిస్తున్న శానిటేషన్ అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వేతనాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఇది కూడా చదవండి..: 112 Call Saves Lives | 112 కాల్తో తల్లీబిడ్డల ప్రాణాలు సేఫ్