ఆంధ్రప్రదేశ్​Bus Fire Accident | ఉలవపాడు హైవేపై ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం.. బ‌స్సులో 35 మంది...

Bus Fire Accident | ఉలవపాడు హైవేపై ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం.. బ‌స్సులో 35 మంది ప్రయాణికులు

హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bus Fire Accident | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా ఉలవపాడు (Ulavapadu) సమీపంలోని జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెద్ద విషాదం తప్పింది.

సమాచారం ప్రకారం, బస్సు ఉలవపాడు ప్రాంతానికి చేరుకునే సమయంలో వెనుక టైర్‌లో బేరింగ్ పట్టేయడంతో మొదట పొగలు రావడం ప్రారంభమైంది. దీనిని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును ఆపి ప్రయాణికులకు హెచ్చరించారు. దీంతో ప్రయాణికులు తమ లగేజీతో పాటు హుటాహుటిన బస్సు నుంచి బయటకు దిగిపోయారు.

Bus Fire Accident | ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు..

ప్రయాణికులు దిగిన కొద్ది సేపటికే మంటలు ఒక్కసారిగా బస్సు మొత్తం వ్యాపించాయి. మంటలు తీవ్రరూపం దాల్చడంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినా, అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ఇక ప్రమాదం తర్వాత ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు కావేరీ ట్రావెల్స్ (Kaveri Travels) యాజమాన్యం వెల్లడించింది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Bus Fire Accident | ఈ ఘటనతో..

డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఎన్‌హెచ్-16పై కొంతసేపు ట్రాఫిక్‌కు  అంతరాయం కూడా ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదం ఎలా జ‌రిగింది అనే దానిపై ఆరాలు తీస్తున్నారు. ఆ మ‌ధ్య ఏపీలో జ‌రిగిన ప‌లు ప్ర‌మాదాల‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోవ‌డం మ‌న‌కు తెలిసిందే.

ఇది కూడా చదవండి..: AP Government Savings Measures|పొదుపు చర్యలపై ముందు ప్రజలను సిద్ధం చేద్దాం.. ఆపై అమలు చేద్దాం:పవన్ కల్యాణ్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Stock Market Gains | ఐటీ సెక్టార్‌లో కొనుగోళ్ల మద్దతు.. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains | ఐటీ షేర్లలో...

Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక: డీఎఫ్​​వో సిద్ధార్థ విక్రమ్​ సింగ్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ​: Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి...

Modi Foreign Tour | ఐదు దేశాల పర్యటనకు బయలు దేరిన మోదీ.. కీలక అంశాలపై చర్చించనున్న ప్రధాని

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Foreign Tour | ప్రధాని నరేంద్ర...

Meta Layoffs | 8 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న మెటా..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Meta Layoffs | ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా...