అక్షరటుడే, ఎల్లారెడ్డి: Dumping Yard | డంపింగ్ యార్డు వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగిరెడ్డిపేట (Nagireddypeta) మండలం తాండూర్ గ్రామ పరిధిలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
Dumping Yard | వ్యక్తిగత.. ఆర్థిక సమస్యలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుడైన చాకలి రాజు (35) డంపింగ్ యార్డు వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు అతని సోదరి లింగంపల్లి మంజుల పోలీసులకు (Nagireddypeta Police) ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో వెంటనే నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ గౌడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో వ్యక్తిగత, ఆర్థిక సమస్యల కారణంగా రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భార్గవ గౌడ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Gas Price Hike | ఒక్కరోజే రూ. 993 పెరిగిన గ్యాస్ ధరలు.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం

