అక్షరటుడే, వెబ్డెస్క్ : Eatala Rajender Support | మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు బీజేపీ (BJP) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మద్దతుగా నిలిచారు. ఈటలకు వ్యతిరేకంగా మల్కాజ్గిరి (Malkajgirir) నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు బీజేపీ నేతలు స్పందించారు.
ఎంపీ ఈటలకు వ్యతిరేకంగా మేడ్చల్ రింగ్ రోడ్డు (ORR), ఇతర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈటల ఏడుపే బీజేపీకి శాపం అని అందులో రాశారు. ఈ ఫ్లెక్సీల వ్యవహారం బీజేపీలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో బీజేపీ నేతలు ఈటలకు వ్యతిరేకంగా బ్యానర్లను ఏర్పాటు చేయడాన్ని ఖండించారు. ఈ మేరకు ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఒక నాయకుడిపై వ్యక్తిగత దాడి సరికాదన్నారు.
Eatala Rajender Support | భయపడుతున్నారు
తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను చూసి కొందరు భయపడుతున్నారని ఆ పార్టీలు నేతలు వ్యాఖ్యానించారు. దీంతోనే ఐఖ్యత దెబ్బతీసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ఇది నీచ రాజకీయాలకు పరాకాష్ఠ అని విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ ఐక్యంగా ఉందన్నారు.
Eatala Rajender Support | దర్యాప్తు చేయాలి
ఫ్లెక్సీల వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు (Ramchandar Rao) స్పందించారు. బీజేపీ వ్యతిరేకస్తులే ఇలా చేశారన్నారు. బీజేపీలో ఐక్యత స్పష్టంగా కనిపిస్తుండడంతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలన్నారు. ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
దీనిని కూడా చదవండి : Eatala Rajender Flexis | నీ ఏడుపే బీజేపీకి శాపం.. ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీల కలకలం


