నిజామాబాద్Elderly Man Missing | పోలీసుల కృషితో పాతికేళ్లకు సొంతింటికి చేరిన వృద్ధుడు

Elderly Man Missing | పోలీసుల కృషితో పాతికేళ్లకు సొంతింటికి చేరిన వృద్ధుడు

దాదాపు పాతికేళ్ల క్రితం తప్పిపోయిన ఓ వృద్ధుడు పోలీసుల కృషితో మళ్లీ సొంతింటికి చేరారు. వివరాలను కామారెడ్డి పోలీసులు వెల్లడించారు.

అక్షరటుడే, కామారెడ్డి: Elderly Man Missing | దాదాపు పాతికేళ్ల క్రితం తప్పిపోయిన ఓ వృద్ధుడు పోలీసుల కృషితో మళ్లీ సొంతింటికి చేరారు. కామారెడ్డి పట్టణ పోలీసులు (Kamareddy Police) శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

Elderly Man Missing | జోగులాంబ గద్వాల్​ జిల్లా పూటన్​పల్లి..

జోగులాంబ గద్వాల్ జిల్లా (Jogulamba Gadwal District) పూటన్ పల్లి గ్రామానికి చెందిన 65 ఏళ్ల సత్యనారాయణ చారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యనారాయణ చారి 24 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. గురువారం రాత్రి కామారెడ్డి పోలీస్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డు రవి పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కనిపించిన సత్యనారాయణ చారి దగ్గర వివరాలు సేకరించారు. అనంతరం కామారెడ్డి పోలీస్ స్టేషన్​కు సమాచారం అందించారు. వెంటనే వారు గద్వాల్ పోలీస్ స్టేషన్​కు వివరాలను అందజేయగా వారు వివరాలు తెలుసుకొని గ్రామంలో విచారించి సత్యనారాయణ తప్పిపోయిన విషయం నిజమేనని నిర్దారించారు. తప్పిపోయిన వ్యక్తి ఫొటో చూసిన కుటుంబ సభ్యులు ఆయన సత్యనారాయణ చారిగా గుర్తుపట్టారు. దాంతో గద్వాల్ పోలీసులు కుటుంబ సభ్యులను కామారెడ్డి (kamareddy)కి పోలీస్ స్టేషన్​కు పంపించారు. శుక్రవారం ఉదయం పట్టణ సీఐ నరహరి (CI Narahari) సమక్షంలో సత్యనారాయణ చారిని వారి కుమారులకు అప్పగించారు. వృద్ధుని ఆచూకీ కనుగొన్న సిబ్బందిని సీఐ అభినందించారు.

ఇది కూడా చదవండి..: Negligent Driving Accident | నిర్లక్ష్యపు కారు డ్రైవింగ్​కు నిండు ప్రాణం బలి..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

US Senator Comments|చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు…. ‘వీసా కార్టెల్’ అంటూ ఆరోపణలు

అక్షరటుడే వెబ్‌డెస్క్:US Senator Comments|అమెరికాలోని మిస్సోరి రాష్ట్ర రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్...

Dharpally Police | ఆగ్రహంతో వేలు కొరికిన వ్యక్తి.. రిమాండ్​కు తరలించిన పోలీసులు

అక్షరటుడే, డిచ్​పల్లి: Dharpally Police | చిన్నపాటి వాగ్వాదంలో ఓ వ్యక్తి...

Paddy Procurement | చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

అక్షరటుడే, ​భీమ్​గల్ : Paddy Procurement | కొన్నిచోట్ల పంట ఆలస్యంగా...

Telangana Sewerage Projects | పట్టణాల్లో ‘మెగా’ సీవరేజ్ ప్రాజెక్టులు.. రూ. 3,705 కోట్లు కేటాయించిన సర్కార్

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana Sewerage Projects|తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం , మురుగునీటి...