అక్షరటుడే, బోధన్: Electric Shock | బోధన్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఆరేసేందుకు వెళ్లి విద్యుత్తీగలు తగిలి మహిళ మృతిచెందగా.. ఆమెను కాపాడేందుకు వెళ్లిన భర్త సైతం షాక్కు గురై దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన బోధన్ (Bodhan) మండలంలోని ఊట్పల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
Electric Shock | విద్యుత్ సరఫరా కావడంతో..
మండలంలోని ఊట్పల్లిలో సంజీవ్, జ్యోతి దంపతులు నివాసముంటున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. అయితే ఆదివారం జ్యోతి దుస్తులు ఆరేసేందుకు దండంను ముట్టకుంది. అయితే అప్పటికే ఆ దండానికి విద్యుత్ సరఫరా ఉండడంతో ఆమె విద్యుత్ షాక్కు గురైంది. ఆమె అరుపులు విన్న భర్త సంజీవ్ ఆమెను కాపాడేందుకు వెళ్లి ఆయన సైతం విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇద్దరు షాక్తో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటనాస్థలానికి చేరుకుని బోరున విలపించారు. దంపతుల మృతితో ముగ్గురు కూతుళ్లు అనాథలుగా మారారు. ఊట్పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన బోధన్ రూరల్(Bodhan Rural Police) ఎస్సై రాజశేఖర్ దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: తిరుపతిలో శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా