GGH Nizamabad | అరుదైన శస్త్రచికిత్సకు వేదికగా నిలిచిన నిజామాబాద్ జీజీహెచ్​

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: GGH Nizamabad | జీజీహెచ్​ నిజామాబాద్​లో వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిలోని గుండె వైద్య సేవల విభాగం పీటీసీఏ (పెర్క్యుటేనియస్ ట్రాన్స్‌లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ) (PTCA Surgery) సర్జరీ చేసి ఓ ప్రాణాన్ని కాపాడింది.

GGH Nizamabad | గుండెపోటు వచ్చిన రోగికి అత్యవసరంగా..

ggh5

నగరంలోని జిల్లా జనరల్​ ఆస్పత్రికి(GGH) 65ఏళ్ల వయస్సున్న బురాజీ అనేవ్యక్తి మంగళవారం రాత్రి తీవ్రమైన ఛాతినొప్పితో(Heart Attack Treatment) వచ్చాడు. వైద్యులు పరీక్షించి ఆయనకు అక్యూట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్ (Acute MI)తో గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. రోగి పరిస్థితిని గుర్తించిన కార్డియాలజీ బృందం వెంటనే థ్రాంబోలైసిస్ చేసి రోగిని స్థిరీకరించింది. అనంతరం గురువారం నిర్వహించిన యాంజియోగ్రామ్ పరీక్షలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రైట్ కరోనరీ ఆర్టరీ (RCA)లో (Coronary Angioplasty) తీవ్ర బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కార్డియాలజీ బృందం విజయవంతంగా పెర్క్యుటేనియస్ ట్రాన్స్‌లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ పీటీసీఏ (PTCA), స్టెంట్ అమరిక చేపట్టింది. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి, కోలుకుంటున్నారు.

GGH Nizamabad | అత్యాధునిక శస్త్రచికిత్స చేయడంపై..

ggh4

జీజీహెచ్ నిజామాబాద్‌లో మొట్టమొదటి పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియను కార్డియాలజీ విభాగ వైద్యులు సందీప్, గోపీకృష్ణ, రవికిరణ్​ల బృందం విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ బీవీ నాగమోహన్, డిప్యూటీ సూపరింటెండెంట్ రాములు, కార్డియాలజీ బృందాన్ని, క్యాథ్ ల్యాబ్ సిబ్బందిని, నర్సింగ్, సహాయక సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు అత్యాధునిక గుండె వైద్య సేవలను స్థానికంగానే అందించడంలో ఇది ఒక కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ఇకపై గుండెపోటు రోగులకు అత్యవసర చికిత్సలు, స్టెంట్ ప్రక్రియలు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన, సకాలంలో అత్యవసర గుండె వైద్య సేవలు అందించేందుకు జీజీహెచ్ నిజామాబాద్ నిరంతరం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Ameerpet Fire Accident | అమీర్‌పేట్ అగ్నిప్రమాదంపై కవిత ఫైర్.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *