అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Maharana Pratap Statue | నగరంలో మహారాణా ప్రతాప్ సింగ్(Maharana Pratap) విగ్రహ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (BJP MLA Dhanpal Surya Narayana Gupta) తెలిపారు. నగరంలోని (Nizamabad City) ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో మహారాణా ప్రతాప్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
Maharana Pratap Statue | అత్యంత ధైర్యవంతుడైన రాజు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చరిత్రలో అత్యంత ధైర్యవంతుడైన రాజుల్లో మహారాణా ప్రతాప్ ఒకరన్నారు. దేశభక్తి ధైర్య సాహసాల్లో ఆయన ప్రత్యేకంగా నిలిచారన్నారు. మొగల్ చక్రవర్తి అక్బర్ ఆధిపత్యానికి ఎదురుగా నిలిచి స్వాతంత్రం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు. ప్రధానంగా హల్దీ గాటి యుద్ధం ఆయన వీరత్వానికి గుర్తుగా నిలిచిందన్నారు. ఆయన రాజ్యం కోల్పోయిన ఆత్మగౌరవాన్ని కోల్పోలేదన్నారు శత్రువులకు తలవంచకుండా అడవుల్లో కష్టాలు పడుతూ జీవించారని గుర్తు చేశారు.
నేటి యువత మహారాణా ప్రతాప్ సింగ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో బొందిల రజక సంఘం అధ్యక్షుడు బొందిల బలరాం సింగ్, కార్యదర్శి నరేష్ సింగ్ కోశాధికారి మహేందర్ సింగ్, ఉపాధ్యక్షుడు తులసీరాం, విజయ్ సింగ్, రమేష్ సింగ్, లఖన్ సింగ్, బీజేపీ కార్పొరేటర్ మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, నాయకులు పవన్ ముందడ, గోసేవ ప్రతినిధి ధాత్రిక రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Bhayandar Vasai Bridge | డబుల్ డెక్కర్ వంతెన నిర్మాణానికి ముందడుగు.. 39 నుంచి 5 కి.మీ.లకు తగ్గనున్న దూరం

