అక్షరటుడే, ఇందూరు: Urban MLA Dhanpal | సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈనెల 10న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలోని మిర్చి కాంపౌండ్ రోడ్లో శుక్రవారం వాల్ పెయింటింగ్ వేశారు.
Urban MLA Dhanpal | రూ. 8 వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana)లో సుమారు రూ.8 వేల కోట్లతో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. 10న సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభకు ఇందూరు జిల్లా, నగర వాసులు భారీగా తరలిరావాలన్నారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న మోదీకి ఘనంగా ఆహ్వానం పలకాలన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ (BJP)కి మరింత ఆదరణ పెరిగిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, దాంపల్లి మురళి, బంటు ప్రవీణ్, కైరంకొండ మురళి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Division Problems | సమస్యల పరిష్కారానికి కృషి : మున్సిపల్ కమిషనర్

