అక్షరటుడే, కామారెడ్డి: School Recognition | పట్టణంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న గౌతమ్ మోడల్ స్కూల్(Gautam Model School) గుర్తింపును రద్దుచేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారతీయ విద్యార్థి సంఘం జిల్లా ఇన్ఛార్జి విఠల్ డిమాండ్ చేశారు. గురువారం భారతీయ విద్యార్థి సంఘం నాయకులు (Kamareddy)పాఠశాల ఫ్లెక్సీలు, కరపత్రాలను చింపివేసి దహనం చేశారు.
School Recognition | అనుమతి లేకుండానే పాఠశాల షిఫ్ట్..
ఈ సందర్భంగా విఠల్, ఆర్బాస్ ఖాన్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండానే పాఠశాలను షిఫ్ట్ చేయడం, ప్రైమరీ విద్యార్థులకు రెండో అంతస్తులో తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. లిఫ్టు వాడకంతో చిన్నారులకు ప్రమాదం పొంచి ఉందని, అధిక ఫీజులు వసూలు చేస్తూ పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాలు విక్రయిస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా మోడల్ పదాన్ని వాడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కార్పొరేట్ పాఠశాలకు వత్తాసు పలుకుతున్న ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఈవో మాత్రం పత్రిక ప్రకటనలకే పరిమితమయ్యారని విమర్శించారు. వెంటనే స్కూల్ గుర్తింపు రద్దుచేసి కేసులు నమోదు చేయకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరణ్ సింగ్, రాజకుమార్, అబ్దుల్ సలాం తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: తుంగభద్రలో మన నీటి వాటాకు తూట్లు పొడిచే పనికి రేవంత్ మద్దతు: కవిత