అక్షరటుడే, బాన్సువాడ: Manjeera Tragedy | బాన్సువాడ ప్రాంతంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు మంజీర నదిలో గల్లంతయ్యారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన బాన్సువాడ మండలం బుడ్మి సమీపంలోని మంజీరా నదిలో (Manjeera River) చోటుచేసుకుంది.
Manjeera Tragedy | స్నానాలు చేసేందుకు దిగిన నలుగురు..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నలుగురు స్నేహితులు కలిసి సరదాగా మంజీర నదికి వెళ్లారు. నదిలో స్నానం చేస్తుండగా లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో ఒక్కసారిగా నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతైనట్లు సమాచారం. వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి సాగిన శోధన అనంతరం ముగ్గురు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి (Banswada Area Hospital) తరలించారు. మరొకరి ఆచూకీ కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. సంఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. తమ పిల్లల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: KA Paul Counter | పవన్ కల్యాణ్కు కేఏ పాల్ కౌంటర్
