అక్షరటుడే, కామారెడ్డి: Doctors Association | ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ కామారెడ్డి(kamareddy) యూనిట్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అధ్యక్ష పదవితో పాటు ఇతర పోస్టులకు సింగిల్ నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి (health department) డా.విజయ భాస్కర్ ప్రకటించారు. ఈనెల 18 వరకు కార్యవర్గంలో పోస్టులకు సంబంధించిన నామినేషన్స్ స్వీకరించారు. ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో కమిటీ మొత్తం ఏకగ్రీవమైంది. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు మంగళవారం(medical committee) సాయంత్రం వరకు గడువు ఉండటం, ఇతర నామినేషన్స్ రాకపోవడంతో ఏకగ్రీవంగా ప్రకటించారు.
Doctors Association | అధ్యక్షుడిగా శ్రీనివాస్..
డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా శరత్, కోశాధికారిగా రాజు, జనరల్ కౌన్సిల్ సభ్యులుగా విజయరాజు, మధుసూదన్, జ్యోతి, ఉపాధ్యక్షులుగా రేఖ, యాదగిరి, ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రెటరీలుగా ఎస్.బి కవిత, పార్థసారథి, బి.కవిత, యూనిట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా శివప్రసాద్, శ్రీనివాస్, గౌతమి, సంగీత్ కుమార్, మౌనిక, సమీన మహమ్మద్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి విజయ భాస్కర్ ప్రకటించారు. ఎన్నికైన ఈ కమిటీ 2026-28 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ : మంత్రి పొన్నం ప్రభాకర్

