Tahsildar Suspension | అసైన్డ్​​ భూముల రిజిస్ట్రేషన్​.. తహశీల్దార్​పై వేటు

నందిపేట తహశీల్దార్​ సంతోష్​రెడ్డిని సస్పెండ్​ చేస్తూ కలెక్టర్​ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Tahsildar Suspension | నిజామాబాద్ (Nizamabad)​ జిల్లా నందిపేట తహశీల్దార్​ సంతోష్​రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్​ భూములను రిజిస్ట్రేషన్​ చేశారు. దీనిపై విచారన చేపట్టిన కలెక్టర్​ తహశీల్దార్​ను సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tahsildar Suspension | విచారణ అనంతరం

నందిపేట (Nandipet) మండలంలోని పలు గ్రామాల్లో అసైన్డ్​ భూములు ఉన్నాయి. అయితే ఆస్తి బదలాయింపు పెండింగ్​లో పలు దరఖాస్తులు ఉన్నాయి. వాటి లబ్ధిదారులతో తహశీల్దార్​ మాట్లాడుకొని అక్రమంగా పట్టా చేసినట్లు సమాచారం. ఈ మేరకు కలెక్టర్​కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమె విచారణకు ఆదేశించారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ విచారణ చేసి కలెక్టర్​కు నివేదిక అందించారు. ఆ నివేదిక ఆధారంగా కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Ila Tripati) నందిపేట తహశీల్దార్ సంతోష్ రెడ్డిని సస్పెండ్​ చేశారు.

దీనిని కూడా చదవండి : Leopard Killing Arrest | చిరుతను హతమార్చిన ఇద్దరి అరెస్ట్​: సీపీ సాయిచైతన్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *