అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: TGEJAC Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) సానుకూలంగా స్పందించడం హర్షణీయమని టీజీఈజేఏసీ (tgejac) జిల్లా ఛైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని టీఎన్జీవోస్ భవన్లో (TNGOs Bhavan) సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
TGEJAC Nizamabad | ఒక రోజు నిరాహార దీక్షను విరమిస్తున్నాం..
టీజీఈజేఏసీ రాష్ట్ర ఛైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రెటరీ ఏలూరి శ్రీనివాస్ ఆదేశానుసారం 5వ తేదీన నిర్వహించాలనుకున్న ఒకరోజు నిరాహార దీక్షను విరమించుకుంటున్నట్లు నాశెట్టి సుమన్కుమార్ తెలిపారు. భవిష్యత్లో రాష్ట్ర కమిటీ నిర్ణయాల మేరకు ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి నేతికుంట శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ విభాగంలో భారీగా ఎస్సైల బదిలీలు.. సైబరాబాద్ నుంచి చార్మినార్ జోన్కు 32 మంది సరెండర్!

