Nizamabad Ring Road | నగరానికి రింగ్​ రోడ్డు కేటాయించకపోవడం దురదృష్టకరం: ఎమ్మెల్యే ధన్​పాల్​

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Ring Road | నిజామాబాద్ నగరానికి రింగ్ ​రోడ్డు కేటాయించకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ధన్​పాల్ (mla dhanpal) అన్నారు. రాష్ట్రంలో మూడు జిల్లాలకు కేటాయించారని.. అందులో నిజామాబాద్​ నగరం (Nizamabad City) లేదన్నారు. నగరంలోని ఓల్డ్ ఎన్జీవోస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని గురువారం ప్రారంభించారు.

Nizamabad Ring Road | కమ్యూనిటీ హాల్​ నిర్మించుకోవడం అభినందనీయం..

ప్రభుత్వంపై ఆధారపడకుండా కాలనీవాసులు ఐక్యతతో కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే ధన్​పాల్​ అన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలోకెల్లా అత్యధికంగా వ్యాపారులు, మేధావులు, విద్యావంతులు ఎన్జీవోస్ కాలనీలోనే (NGOs Colony) ఉన్నారన్నారు. అందరి కృషితోనే అద్భుతమైన నిర్మాణం జరిగిందన్నారు. ప్రభుత్వ సహకారం కూడా ఉండాలని, తన ఎమ్మెల్యే ఫండ్ వచ్చిన తర్వాత తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. తన ట్రస్ట్​ ద్వారా సాయం అందించడం సంతోషంగా ఉందని చెప్పారు.

ఇప్పటికే పాత పనులపై అనేకసార్లు మంత్రులు, అధికారులను కలిశానన్నారు. త్వరలోనే సీఎంని కలిసి నగరాభివృద్ధి కోసం లేఖను అందించనున్నట్లు చెప్పారు. ఎలక్షన్ల ముందే రాజకీయమని, తర్వాత అందరినీ కలుపుకొని అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్​ సహకారంతో కేంద్ర నిధులు పుష్కలంగా అందుతున్నాయన్నారు.

Nizamabad Ring Road | వరంగల్​ తర్వాత అతిపెద్ద నగరం నిజామాబాద్​..

రాష్ట్రంలో వరంగల్ (Warangal) తర్వాత అతిపెద్ద నగరం నిజామాబాద్ అని, అయినా నగరానికి రింగ్​రోడ్డు మంజూరు చేయలేదన్నారు. అలాగే రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా స్పెషల్ ఫండ్ మంజూరు కాని నియోజకవర్గం కూడా నిజామాబాద్​ అర్బన్ ​(Nizamabad Urban) అని ఆయన పేర్కొన్నారు. పక్కనే ఉన్న రూరల్​కు​ సైతం ఫండ్​ ఇస్తున్నారని.. ఇందూరుపై మాత్రం వివక్ష చూపుతున్నారని చెప్పారు.

కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, నుడా ఛైర్మన్ కేశ వేణు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కార్పొరేటర్లు జ్యోతి, మురళి, నాగోల్ల లక్ష్మీనారాయణ, పరమేశ్వర్, మఠం పవన్, ప్రవీణ్ గౌడ్, అసోసియేషన్ అధ్యక్షుడు పోతనకర్ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వాసు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Stock Market Rally | వాల్యూ బయ్యింగ్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *