అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Har Ghar Tiranga | ప్రధాని మోదీ (PM Modi) ఇచ్చిన పిలుపు మేరకు ‘హర్ గర్ తిరంగా’లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు.
Har Ghar Tiranga | దేశభక్తి చాటుకోవాలి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు జెండా ఎగురవేసిన అనంతరం యెండల మాట్లాడారు. భారతీయులలో దేశభక్తిని, ఐక్యత శక్తిని పెంపొందించడం కోసం దేశ ప్రధాని మోదీ హర్ గర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి తమ దేశభక్తిని చాటుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశ విద్రోహశక్తులకు దేశభక్తితోనే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి..: Young India School | యంగ్ ఇండియా స్కూల్ కలేనా!