Tadwai BRS Protest | తాడ్వాయిలో టెన్షన్​..టెన్షన్​.. ధర్నాకు వేములను అనుమతించడంపై తీవ్ర ఉత్కంఠ

తాడ్వాయి మండలం కేంద్రంలో నేడు బీఆర్​ఎస్​ రైతు ధర్నా నేపథ్యంలో పోలీసులు అలర్ట్​ అయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Tadwai BRS Protest | ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేపట్టే ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే ప్రతిసారీ నిరసనలు హైటెన్షన్ కు దారితీస్తుండటంతో నేడు నిర్వహించే రైతు ధర్నాపై ఉత్కంఠ నెలకొంది.

Tadwai BRS Protest | కాంగ్రెస్​ వెయ్యి రోజుల పాలనపై..

కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలకు నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ తాడ్వాయి (Tadwai) మండల కేంద్రంలో రైతు సమస్యలపై బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ ధర్నాకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరవుతారని బీఆర్ఎస్ ప్రకటించింది. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలంటూ ఊరూరా చాటింపు కూడా వేయించారు. అయితే గత అనుభవాల నేపథ్యంలో ఈ ధర్నాకు అనుమతి ఇస్తారా లేదా అనేది ప్రశ్నగా మారింది.

Tadwai BRS Protest |  యూరియా యాప్​తో ఇబ్బందులు..

గత జూన్ నెలలో యూరియా యాప్ వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులపై ఇదే తాడ్వాయి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. అప్పుడు ప్రశాంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఆయనను తాడ్వాయికి రాకుండా హైదరాబాద్​లోని నివాసంలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ తాడ్వాయిలో బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా చేరుకోగా, ఒక వ్యక్తి పెట్రోల్ బాటిల్ తీసుకురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరికి సాధారణ వ్యక్తిగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తాడ్వాయిలో, అదే రైతు సమస్యలపైనే ధర్నా జరుగుతుండటం, దానికి ప్రశాంత్ రెడ్డి హాజరవుతుండటంతో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

june

ఈ ఏడాది జూన్​లో బీఆర్​ఎస్​ ధర్నాలో భాగంగా కార్యకర్త పెట్రోల్​ బాటిల్​తో ఆత్మహత్యాయత్నం చేయగా బాటిల్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్న దృశ్యం

 

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ సంచలన సవాల్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *