అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Division Increase | హైదరబాద్ (Hyderabad) మహా నగరం పరిధిలో మళ్లీ డివిజన్లు పెంచనున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో గతంలో ప్రభుత్వం పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసిన విషయం తెలిసిందే. అనంతరం 150 డివిజన్లను 300కు పెంచింది. అనంతరం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించింది. తాజాగా మరోసారి ఆయా కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్య పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
గతంలో ఉన్న జీహెచ్ఎంసీ (GHMC) ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు హద్దులు నిర్ణయించి, డివిజన్ల పునర్విభజన చేసింది. ఈ మూడు కార్పొరేషన్లలో ప్రస్తుతం 300 డివిజన్లు ఉండగా.. వాటిని 400కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
Hyderabad Division Increase | విభజన ఇలా
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 150 డివిజన్లు ఉండగా.. 200కు పెంచనున్నారు. మల్కాజ్ గిరి కార్పొరేషన్లో76 నుంచి 100 డివిజన్లకు, సైబరాబాద్ కార్పొరేషన్లో 74 నుంచి 100 డివిజన్లకు పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. పరిపాలన సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగానే మరోసారి డివిజన్లు పెంచనున్నట్లు సమాచారం.
Hyderabad Division Increase | త్వరలో ఎన్నికలు
జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగిసిపోయింది. దీంతో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నవంబర్ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీతో పాటే సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. హైదరాబాద్ నగరంలో నాయకులు పర్యటిస్తున్నారు. బస్తీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. మరోవైపు పారిశుధ్యం, తాగునీటిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
ఇది కూడా చదవండి..: Hyderabad Fake Paneer | హైదరాబాద్లో కల్తీ పనీర్ దందా బట్టబయలు: 825 కిలోలు స్వాధీనం.. వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు