అక్షరటుడే, వెబ్డెస్క్ : Godavari Kaveri Link | గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్రం స్పష్టం చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) అన్నారు. మిగులు జలాల మీద డీపీఆర్ (DPR) ఆమోదం తెలపడం సాధ్యం కాదన్నారు. అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో గోదావరి కావేరీ నదుల అనుసంధానం అని చంద్రబాబు కొత్త కుట్రకు తెర లేపారని విమర్శించారు.
తెలంగాణ భవన్లో హరీశ్రావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మక్క సారక్క ప్రాజెక్టు నుంచి నదుల అనుసంధానం మొదలు అవ్వాలని ప్రతిపాదించామన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు (Chandrababu) కుట్రతో అసలు తెలంగాణ భూభాగానికి సంబంధం లేకుండానే నదుల అనుసంధానం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు.
Godavari Kaveri Link | బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు

ఏపీ ప్రభుత్వం తమకు ఆదర్శం అని చెప్పే KL Rao కూడా నదుల అనుసంధానం తెలంగాణ నుంచి చేయాలని చెప్పారని హరీశ్రావు (Godavari Kaveri Link) అన్నారు. ఏపీ బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని కీలు బొమ్మ లాగా ఆడిస్తుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా చూస్తున్నారని విమర్శించారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నాయన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా సమ్మక్క సారక్క నుంచి నాగార్జున సాగర్ అక్కడి నుంచి సోమశిల తరలించి కావేరీ నదికి అనుసంధానం చేసేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. కానీ నేడు ఏపీ ప్రభుత్వం నీళ్లను తరలించుకు పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు.
ఏపీ ప్రభుత్వం తమకు ఆదర్శం అని చెప్పే KL Rao కూడా నదుల అనుసంధానం తెలంగాణ నుండి చేయాలని చెప్పాడు
ఏపీ బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని కీలు బొమ్మ లాగా ఆడిస్తుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా చూస్తున్నారు
– హరీష్ రావు https://t.co/JX4uYOI6dD pic.twitter.com/uGJYjvEf0G
— Telugu Scribe (@TeluguScribe) June 7, 2026
దీనిని కూడా చదవండి : Fish Prasadam Distribution | హైదరాబాద్లో రేపు చేప ప్రసాదం పంపిణీ
