Fish Prasadam Distribution | హైదరాబాద్​లో రేపు చేప ప్రసాదం పంపిణీ

హైదరాబాద్​లో సోమవారం నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fish Prasadam Distribution | హైదరాబాద్ (Hyderabad)​లో సోమవారం నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిరంతరయంగా కొనసాగుతోంది.

మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్​లో బత్తిని సోదరులు (Bathini Brothers) ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. 179 ఏళ్లుగా ఆ కుటుంబం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. చేప ప్రసాదం స్వీకరిస్తే ఆస్తమా, శ్వాస సంబంధ వ్యాధులు నయం అవుతాయని నమ్మకం ఉంది. దీంతో దీనిని తీసుకోవడానికి దేశ నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వస్తారు. నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ (Nampally Exhibition Grounds)లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. చేపతో ఇబ్బంది ఉన్న వారికి బెల్లం ప్రసాదం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

hyderabad 1

Fish Prasadam Distribution | ఏర్పాట్లు పూర్తి

చేప ప్రసాదం స్వీకరించడానికి వచ్చే వారి కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)​, వాకిటి శ్రీహరి ఏర్పాట్లను పరిశీలించారు. ఎప్పుడైనా మృగశిర కార్తె ఉదయం వస్తుంది. ఈసారి 8 వ తేదీ రాత్రి 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని స్వచ్ఛంద సంస్థలు భాగస్వామయమై ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారికి ఇబ్బందులు కలగకుండా వారికి వసతి సౌకర్యం ,ఆహారం తదితర ఏర్పాట్లు చేస్తున్నారు.

Fish Prasadam Distribution | అందుబాటులో చేపపిల్లలు

బత్తిని సోదరులు ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని చేపలో పెట్టి ప్రజలకు ఇస్తారు. దానిని మింగాల్సి ఉంటుంది. దీని కోసం చిన్న చేప పిల్లలను వినియోగిస్తారు. ఈ మేరకు చేప ప్రసాదం పంపిణీ కోసం అవసరం అయని చేప పిల్లలను సిద్ధం చేశారు. క్యూలైన్ లలో తొక్కిసలాట జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతలకి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆదేశించారు. వేసవి కావడంతో క్యూ లైన్​లు ఉన్న ప్రాంతాల్లో ఫ్యాన్​లు , కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : LPG Gas Price Hike | వినియోగదారులకు షాక్​.. మళ్లీ పెరిగిన గ్యాస్​ ధరలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *