అక్షరటుడే, వెబ్డెస్క్ : Fish Prasadam Distribution | హైదరాబాద్ (Hyderabad)లో సోమవారం నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిరంతరయంగా కొనసాగుతోంది.
మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లో బత్తిని సోదరులు (Bathini Brothers) ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. 179 ఏళ్లుగా ఆ కుటుంబం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. చేప ప్రసాదం స్వీకరిస్తే ఆస్తమా, శ్వాస సంబంధ వ్యాధులు నయం అవుతాయని నమ్మకం ఉంది. దీంతో దీనిని తీసుకోవడానికి దేశ నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వస్తారు. నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ (Nampally Exhibition Grounds)లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. చేపతో ఇబ్బంది ఉన్న వారికి బెల్లం ప్రసాదం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Fish Prasadam Distribution | ఏర్పాట్లు పూర్తి
చేప ప్రసాదం స్వీకరించడానికి వచ్చే వారి కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వాకిటి శ్రీహరి ఏర్పాట్లను పరిశీలించారు. ఎప్పుడైనా మృగశిర కార్తె ఉదయం వస్తుంది. ఈసారి 8 వ తేదీ రాత్రి 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని స్వచ్ఛంద సంస్థలు భాగస్వామయమై ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారికి ఇబ్బందులు కలగకుండా వారికి వసతి సౌకర్యం ,ఆహారం తదితర ఏర్పాట్లు చేస్తున్నారు.
Fish Prasadam Distribution | అందుబాటులో చేపపిల్లలు
బత్తిని సోదరులు ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని చేపలో పెట్టి ప్రజలకు ఇస్తారు. దానిని మింగాల్సి ఉంటుంది. దీని కోసం చిన్న చేప పిల్లలను వినియోగిస్తారు. ఈ మేరకు చేప ప్రసాదం పంపిణీ కోసం అవసరం అయని చేప పిల్లలను సిద్ధం చేశారు. క్యూలైన్ లలో తొక్కిసలాట జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతలకి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వేసవి కావడంతో క్యూ లైన్లు ఉన్న ప్రాంతాల్లో ఫ్యాన్లు , కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
దీనిని కూడా చదవండి : LPG Gas Price Hike | వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు
