అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Trap Gang | హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు అన్నదమ్ములు ధనవంతులైన అమ్మాయిలను ట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్కు పాల్పడ్డారు. నిందితులకు వారి తల్లి సహకరించడం గమనార్హం.
ఈ ముఠా ప్రధాన సూత్రధారి అర్జున్, అతని సోదరుడు రాజీవ్, తల్లి,మామయ్య, నలుగురు సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ సభ్యులు ఇన్స్టాగ్రామ్ (Instagram)లో తాము ధనవంతులం అని నటించేవారు. ధనవంతుల కుటుంబాలకు చెందిన యువతులను లక్ష్యంగా చేసుకునేవారు. వారిని విలాసవంతమైన కార్లలోకి ఆకర్షించి, లైంగిక దాడికి పాల్పడి వీడియోలు చిత్రీకరించేవారు. అనంతరం డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలు వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్కు పాల్పడేవారు.
Hyderabad Trap Gang | 19 మందిని..
ఈ కేసులో అర్జున్, రాజీవ్ 19 మంది మైనర్లను ట్రాప్ చేశారు. ఈ కేసు వివరాలను సీపీ సజ్జనార్ (CP Sajjanar) వెల్లడించారు. అమ్మాయిలను ట్రాప్ చేసి ఖరీదైన కార్లలోనే లైంగిక చర్యలకు అర్జున్ పాల్పడ్డాడని చెప్పారు. ఇద్దరు నిందితులకు వారి తల్లి మీనాకుమారి కూడా సహకరించినట్లుగా గుర్తించామన్నారు. గుంటూరుకు చెందిన వీరు హైదరాబాద్కు వచ్చి ట్రాప్ చేస్తూ మోసాలు చేయడం ప్రారంభించారని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Illegal Mining | అక్రమ మైనింగ్పై హైడ్రా ఉక్కుపాదం

