అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajahmundry Accident | ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఒక మాల్ బయట ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. అనంతరం 28 ఏళ్ల వైద్య విద్యార్థినిని కారుతో ఢీకొట్టడంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. ఈ ఘటన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఆ ఇద్దరు యువకులు షాపింగ్ కాంప్లెక్స్కు రాకముందు మద్యం సేవించి, ఆ తర్వాత భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాల్ నుండి వెళ్లిపోయిన తర్వాత ఘర్షణ తీవ్రరూపం దాల్చినట్లు సమాచారం. ఆ ఇద్దరూ తీవ్ర ఆగ్రహంతో కారులో అక్కడినుంచి వెళ్లిపోయి, ప్రాంగణం బయట రోడ్డుపై ఉన్న ప్రియాంక అనే వైద్య విద్యార్థినిని ఢీకొట్టారు. వాహనం ఆమె తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
Rajahmundry Accident | రాజమండ్రి ఆస్పత్రికి తరలింపు
తీవ్రంగా గాయపడ్డ వైద్య విద్యార్థిని అత్యవసర చికిత్స కోసం రాజమండ్రిలోని (Rajahmundry Accident) ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అధునాతన న్యూరలాజికల్ కేర్ కోసం రిఫర్ చేశారు. మెరుగైన చికిత్స, వైద్య సహాయం కోసం ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలిస్తున్నట్లు సమాచారం. కాగా ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రమాద సమయంలో కారు నడుపుతున్న సురవరపు యశ్వంత్తో సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
#AndhraPradesh – A 28 YO medical student Dr. Priyanka, was declared brain dead after she was run over by a car following an altercation at a mall Rajahmundry.
Two youth under the influence of alcohol, got into a dispute with mall security before driving away recklessly. pic.twitter.com/VEq3w4uoPl
— NewsMeter (@NewsMeter_In) August 6, 2026
దీనిని కూడా చదవండి : Mahesh Kumar Goud | దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయటపెట్టాలి: పీసీసీ చీఫ్