అక్షరటుడే, వెబ్డెస్క్ :Hyderabad Women Safety | హైదరాబాద్ (Hyderabad) నగరంలో అర్ధరాత్రి పోకిరీలు హల్చల్ చేస్తారు. రోడ్లపై వేగంగా వాహనాలను నడుపుతూ హంగామా చేస్తారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే వేధింపులకు గురి చేస్తారు. మహిళల ఇబ్బందులను గుర్తించడానికి ఓ అధికారి ఒంటరిగా రోడ్డుపై నిలబడ్డారు.
హైదరాబాద్ వీధుల్లో అర్ధరాత్రి మహిళలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవడానికి ఒక ఐపీఎస్ అధికారిణి (IPS Officer) దిల్సుఖ్నగర్ బస్టాండ్ (Dilsukhnagar Bus Stand) వద్ద ఒంటిరగా నిలబడ్డారు. ఆ తర్వాత ఆమెకు ఎదురైన అనుభవాలు మహిళల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. “వస్తావా?” అనడం నుంచి అసభ్యకరమైన ప్రతిపాదనలు, పదేపదే వేధింపుల వరకు అర్ధరాత్రి 12.30 నుండి 3.30 గంటల మధ్య దాదాపు 40 మంది పురుషులు ఆమె దగ్గరకు వచ్చారు. ఆమె ఎవరో కాదు మల్కాజిగిరి సీపీ సుమతి (Malkajgiri CP Sumathi). తన దగ్గరకు వచ్చిన పోకిరీలను పట్టుకొని ఆమె కౌన్సెలింగ్ ఇచ్చారు.
Hyderabad Women Safety | మద్యం మత్తులో..
సీపీ దగ్గరకు వచ్చిన వారిలో చాలామంది మద్యం సేవించి ఉండగా, మరికొందరు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం. వారిలో విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. కానీ వారిని పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి, మహిళల పట్ల వారి ప్రవర్తన గురించి హెచ్చరించారు. కాగా ఇలాంటి ఆపరేషన్ ఆమెకు ఇదే మొదటిసారి కాదు. 25 సంవత్సరాల క్రితం, కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో క్షేత్రస్థాయిలో మహిళల భద్రతను అర్థం చేసుకోవడానికి ఆమె ఇలాంటి ఆపరేషన్ నిర్వహించారు.
ఇది కూడా చదవండి..: Cyber Fraud Hyderabad| ఫేస్బుక్ యాడ్పై నొక్కి.. రూ.1.75 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి

