అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | బోధన్ (Bodhan) పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం ఠాణాలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఓ ఎస్సై లంచం తీసుకుంటూ దొరికినట్లు సమాచారం. ఓ పాత కేసు విషయంలో డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ACB Raids | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలన ఇకోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
దీనిని కూడా చదవండి : Wedding Car Accident | కాసేపట్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులకు గాయాలు

