Ibrahimpatnam Road Accident | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్​ విద్యార్థుల మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్​ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ibrahimpatnam Road Accident | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు బీటెక్​ విద్యార్థులు మృతి చెందారు.

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ కాలేజీకి చెందిన నలుగురు బీటెక్​ ఫస్టియర్​ విద్యార్థులు బుధవారం రాత్రి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. హైదరాబాద్​ వైపు వెళ్తున్న ఓ టాటా ఏసీ వాహనం వేగంగా వచ్చి వారిని ఢీకొంది. ఈ ఘటనలో నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​కు చెందిన హర్షవర్ధన్​ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Ibrahimpatnam Road Accident | చికిత్స పొందుతూ..

క్షతగాత్రులను స్థానికులు మన్నెగూడ లోని మహానీయ హాస్పిటల్​కు తరలించారు. అందులో తీవ్రంగా గాయపడ్డ వరంగల్​కు చెందిన శివరాజ్​ చికిత్స పొందుతూ చనిపోయాడు. కౌమిద్‌రెడ్డి, అక్షమ్‌, కార్తిక్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Cyber Frauds | ఫోన్లు చోరీ చేసి.. సైబర్​ మోసాలు చేస్తున్న ముఠా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *