అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kalyani Project Flood | మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కళ్యాణి ప్రాజెక్ట్ (Kalyani Project) జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది.
Kalyani Project Flood | దిగువకు నీటి విడుదల..
వర్షాలకు వరద పెరుగుతుండడంతో నిజాంసాగర్ (Nizamsagar) ప్రధాన కాలువలోకి నీటిని మళ్లిస్తున్నారు. ప్రాజెక్ట్ రెండు వరద గేట్ల ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్లోకి ప్రస్తుతం 430 క్యూసెక్కులు వరద వస్తుండగా.. ఫ్లడ్ గేట్ల ద్వారా 250 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువకు 180 క్యూసెక్కులు మళ్లిస్తున్నారు. ప్రస్తుత నీటి మట్టం ఫుల్ రిజర్వాయర్ లెవల్(ఎఫ్ఆర్ఎల్) కంటే 0.9 మీ తక్కువగా ఉంది. గత ఏడాది భారీ వరదలకు కళ్యాణి ప్రాజెక్టు సైడ్ వాల్స్ కొట్టుకుపోయాయి. దీంతో మరమ్మతులు నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వరద నీటిని ఎక్కువ నిల్వ చేయకుండా వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Munna Snake Rescuer | వన్యప్రాణుల సంరక్షణలో యువతకు మున్నా స్ఫూర్తిదాయకం