అక్షరటుడే, వెబ్డెస్క్ : Kethireddy Suresh Reddy | బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్, మాజీ ఎంపీ కేతిరెడ్డి సురేష్ రెడ్డి (Suresh Reddy) ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సనత్ నగర్లో గల ఆయన నివాసంలో శనివారం దొంగలు పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు సురేశ్ రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. సుమారు రూ. కోటిన్నర విలువైన నగదు, ఇతర సొత్తును చోరీ చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. పక్కా స్కెచ్ ప్రకారమే దొంగతనం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన మాజీ ఎంపీ వెంటనే సనత్ నగర్ (Sanat Nagar) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Kethireddy Suresh Reddy | వీఐపీల ఇళ్లే టార్గెట్..
హైదరాబాద్ నగరంలో ఇటీవల చోరీలు పెరిగాయి. ముఖ్యంగా వీఐపీలు, ప్రముఖుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. అత్యంత భధ్రత ఉండే వారి ఇళ్లలో పక్కాగా చోరీ చేసి పారిపోతున్నారు. ఓ వైపు నేపాల్ ముఠాలు పని మనుషులుగా చేరి దోపిడీలు చేస్తుండగా.. మరో గ్యాంగ్ ప్రముఖుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంది.
దీనిని కూడా చదవండి : Kukatpally Pub Raid | పబ్లో గలీజ్ దందా.. మేనేజర్ అరెస్ట్
