అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Kos Nizamabad | పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాల్లో నిజామాబాద్ కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. స్టేట్ ర్యాంకులతో సత్తా చాటారు. మరియా అరీష 589, సీహెచ్.వర్ష 588, బి.శ్రీకర్ 585, జాహ్నవి 583, కె.అక్షర 583 అత్యుత్తమ మార్కులు సాధించారు.
Kos Nizamabad | స్కూల్ స్థాయి నుంచే..
కేవోఎస్లో స్కూలు స్థాయి నుంచే ఐఐటీ బోధనతో పాటు ప్రణాళికా బద్ధంగా బోధన సాగడంతో ఇంటర్మీడియట్లో జాతీయ స్థాయి ఐఐటీ మెడికల్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని విద్యాసంస్థల ఛైర్ పర్సన్ విజయలక్ష్మి తెలిపారు. 2025, 2026 ఐఐటీ, జేఈఈ మెయిన్స్ ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. తాజాగా విడుదలైన ఎస్సెస్సీ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ పాటు వివిధ స్టేట్ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు.
Kos Nizamabad | ఉత్తమ బోధనా పద్ధతులతోనే..
ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ సీహెచ్.రామోజీ రావు అభినందించారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు విడుదలైన ఎస్సెస్సీ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ పాటు వివిధ స్టేట్ ర్యాంకులు సాధించామన్నారు. స్కూల్ స్థాయిలో ఉత్తమ విద్యాబోధన అందించడం వల్ల అత్యుత్తమ ఫలితాలు సాధ్యమన్నాయని వివరించారు. అలాగే స్కూల్ స్థాయి నుంచే ఐఐటీ, జేఈఈకి సంబంధించి మెరుగైన విద్య బోధించడం వల్ల ఇటీవల జాతీయ స్థాయి ర్యాంకులు సాధించామని చెప్పారు.
Kos Nizamabad | విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట
డైరెక్టర్ సీహెచ్.తేజస్విని మాట్లాడుతూ ఎస్సెస్సీ ఫలితాల్లో తమ విద్యార్థులు స్టేట్ ఫస్ట్ పాటు వివిధ స్టేట్ ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు తమ స్కూల్ నుంచే పునాదులు పడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవల విడుదలైన జాతీయస్థాయి ఐఐటీ, మెడికల్ పరీక్షల్లోనూ తమ విద్యార్థులు ర్యాంకులు సాధించారని వివరించారు. ఇందుకు తాము అందించే ప్రత్యేక బోధనా పద్ధతులు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. రెగ్యులర్ సిలబస్తో పాటు ఐఐటీ ఫౌండేషన్లో రాణించేలా ఎంసెట్ స్థాయి లెక్చరర్లతో శిక్షణ ఇప్పించడం వలనే ఇలాంటి అత్యుత్తమ ఫలితాలు సాధించగలుగుతున్నామని పేర్కొన్నారు.
విద్యార్థులకు సన్మానం
పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్లు రామోజీరావు, తేజస్విని, రాజా సన్మానించారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు సందీప్ కులకర్ణి, వి.రణదీశ్, ఫరీద్దుద్దీన్, నటరాజ్, చంద్రశేఖర్, సుచరిత, వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ కవిత, ఫనీంధర్ ఫనీందర్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: TS SSC Results | పదో తరగతి ఫలితాలు విడుదల

