Mining Permits Contractors | కాంట్రాక్టర్లను వేధించొద్దు.. మైనింగ్​ అధికారులకు మంత్రి సూచన

రోడ్డు ప్రాజెక్టులకు అవసరమైన మెటల్ (కంకర), ఇతర సామగ్రి సేకరణకు సంబంధించిన అనుమతుల విషయంలో కాంట్రాక్టర్లను వేధించవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించారు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mining Permits Contractors | రోడ్డు ప్రాజెక్టులకు అవసరమైన మెటల్ (కంకర), ఇతర నిర్మాణ సామగ్రి సేకరణకు సంబంధించిన అనుమతుల విషయంలో కాంట్రాక్టర్లను వేధించవద్దని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి ఇసుక, మట్టి, మెటల్ అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడే వారిని వదిలేసి, చిన్న మరియు నిజాయితీ గల కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు.

మైనింగ్ సంబంధిత అనుమతులు పొందడంలో రోడ్డు కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మైనింగ్, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy)తో కలిసి శుక్రవారం సచివాలయంలో సమీక్షా నిర్వహించారు. కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. రోడ్డు పనులు చేపడుతున్న చిన్న కాంట్రాక్టర్లపై మెటీరియల్ విలువకు 10 రెట్లు జరిమానా విధించడం సమంజసం కాదని మంత్రులు అభిప్రాయపడ్డారు.

Mining Permits Contractors | రూ.54 కోట్ల జరిమానా సరికాదు

Mining Permits Contractors

రూ. 5 కోట్ల విలువైన అంశానికి సంబంధించి రూ. 54 కోట్ల జరిమానా విధించడం దారుణమని పేర్కొన్న కోమటిరెడ్డి, కాంట్రాక్టర్లు తమ ఒప్పందాల ప్రకారం చెల్లింపులు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ అంతటా అత్యున్నత నాణ్యతతో కూడిన ఆదర్శవంతమైన రోడ్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ (HAM) కింద రోడ్డు నిర్మాణ పనులను చేపట్టిందని మంత్రి తెలిపారు.2028 ఆగస్టు నాటికి రోడ్డు పనులను పూర్తి చేయడమే తమ లక్ష్యం అన్నారు.

ఇది కూడా చదవండి..: Husnabad Development Works | హుస్నాబాద్‌కు రూ. 33.70 కోట్ల నిధులు మంజూరు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *