అక్షరటుడే, వెబ్డెస్క్ : Panduga Sayanna | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముదిరాజ్ (Mudiraj) కులానికి చెందిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన జయంతి అక్టోబర్ 22న, డిసెంబర్ 10న వర్ధంతిని అధికారికంగా నిర్వహించనున్నారు.
Panduga Sayanna | పండుగ సాయన్న ఎవరంటే..
మహబూబ్ నగర్ (Mahabub Nagar) జిల్లాలో జన్మించిన పండుగ సాయన్న నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. అంతేగాకుండా దేశ్ముఖ్లు, దొరలు, ధనవంతులను దోచుకొని ఆ డబ్బులను పేదలకు పంచిపెట్టాడు. తెలంగాణ రాబిన్హుడ్గా పేరుగాంచిన పండుగ సాయన్నను 35 ఏళ్ల వయసులోనే భూస్వాములు కుట్ర పన్ని చంపారు. ఆయన హత్యకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎస్పీ కార్యాలయంపై దాడికి యత్నించగా.. జనాగ్రహాన్ని చూసి ఎస్పీ గుండెపోటుతో చనిపోయాడు. పండుగ సాయన్న చనిపోయాడని పార్టీ చేసుకుంటున్న భూస్వాములను ప్రజలు తగుల బెట్టారు.
Panduga Sayanna | ముదిరాజ్ల వినతి మేరకు..
ముదిరాజ్ కులానికి చెందిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహించాలని ఆ కుల ప్రతినిధులు ఇటీవల మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)ని కలిశారు. వారి వినతి మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాండుగ సాయన్న ముదిరాజ్ జయంతిని ప్రతి ఏటా అక్టోబర్ 22న, వర్ధంతిని డిసెంబర్ 10న రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్లు ఈ కార్యక్రమం నిర్వహించాలి.
The Government of Telangana has issued https://t.co/EpfGvtAD1c.1217 dated 20 August 2026 declaring the birth and death anniversaries of Late Sri Panduga Sayanna Mudiraj as State Functions every year.
Birth Anniversary (Jayanthi): 22 October
Death Anniversary (Vardhanthi): 10… pic.twitter.com/n9OUq3Xyrm— Jacob Ross (@JacobBhoompag) August 20, 2026
దీనిని కూడా చదవండి : Rajampet SI ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై