MP Arvind | విద్యార్థులను మోసం చేస్తున్న ప్రభుత్వం : ఎంపీ అర్వింద్​

ఫీజు రీయింబర్స్​ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందని ​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | ఫీజు రీయింబర్స్​ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ ఢిల్లీలో ఉన్నారని ఎంపీ అర్వింద్ అన్నారు. తెలంగాణను దోచుకున్న ఇద్దరూ ఈరోజు ఢిల్లీలో ఉన్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడంలో వాళ్లు విజయవంతం అయ్యారని విమర్శించారు. ఫీజు బకాయిల కోసం బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తామని తెలిపారు. బీఆర్​ఎస్​ హయాంలో ఫీజు రీయింబర్స్​మెంట్ ఎందుకు ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్​ ఏం చేస్తోందని ప్రశ్నించారు. రీయింబర్స్​మెంట్ రాకపోవడంతో 20 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

MP Arvind | మైనంపల్లి రోహిత్​ను మంత్రి చేయాలి

రాష్ట్రంలో 12 ఏళ్ల నుంచి జాబ్​ క్యాలెండర్​ లేదని అర్వింద్​ అన్నారు. యువతన మోసం చేస్తున్న సీఎం.. కొత్తగా జెన్​జీలను కేంద్రంలో మంత్రి చేస్తామంటున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదన్నారు. కానీ సీఎం రేవంత్​రెడ్డి రాహుల్​ గాంధీ మంత్రివర్గంలో జెన్​జీ వ్యక్తిని విద్యాశాఖ మంత్రిని చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్, యశస్విని రెడ్డి జెన్​జీ తరానికి చెందిన వారని ఎంపీ పేర్కొన్నారు. వారికి విద్యాశాఖ ఇవ్వాలని సవాల్ చేశారు. తెలంగాణలో జెన్​జీ యువతను మంత్రులు చేయాలన్నారు. ఇక్కడ చేయకుండా ఢిల్లీలో చేస్తామనడం విడ్డూరం అని విమర్శించారు.

MP Arvind | కేంద్రంపై బురద చల్లుతున్నారు

సీఎం రేవంత్​రెడ్డి మంత్రివర్గ సగటు వయసు 62 ఏళ్లు అని అర్వింద్​ ధర్మపురి అన్నారు. అలాంటి వ్యక్తి కేంద్రంలో జెన్​ జీలను మంత్రి చేస్తామనడం హస్యాస్పదమన్నారు. సీఎం రేవంత్​రెడ్డికి పాలన చేతకాక కేంద్రంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్​ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​తో సీఎం రేవంత్​రెడ్డి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: Bodhan Municipality | బోధన్ మున్సిపాలిటీలో ఆర్‌డీ విచారణ.. నిధుల గోల్​మాల్​పై సర్వత్రా చర్చ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *