అక్షరటుడే, కామారెడ్డి: MLA KVR | రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా (Rythu Bima) పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి(MLA Venkata Ramana Reddy) అన్నారు. శనివారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
MLA KVR | రూ.442 కోట్ల ప్రీమియం బాకీ..
ఎమ్మెల్యే కేవీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా(Telangana) ఎల్ఐసీకి (LIC) ప్రభుత్వం రూ.442 కోట్లు ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. ఈ ప్రీమియం చెల్లించకపోవడంతో 7,606 మంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వీళ్లందరూ కుటుంబ పెద్దను కోల్పోయిన అనంతరం ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎదురు చూస్తున్నారన్నారు. పంట నష్టపోయి, అప్పులపాలై రైతులే బాధపడుతున్నారని, కనీసం రైతుకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. రైతు బీమా పథకం అనేది ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ భరోసా కల్పించాల్సి ఉంటుందన్నారు. ఈ పథకాన్ని ఏ పార్టీ మొదలు పెట్టినా దానిని ఎలా ముందుకు తీసుకుని వెళ్తున్నామనేది మాత్రమే ముఖ్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి రైతు బీమా పథకానికి సంబంధించి ఎల్ఐసీకి చెల్లించాల్సిన రూ.442 కోట్ల ప్రీమియం చెల్లించి 7,606 మంది రైతు కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదు: కేటీఆర్