అక్షరటుడే, వెబ్డెస్క్ : MLA Prakash Goud | రాజేంద్రనగర్ ఎమ్మెల్యేపై ఆయన కుమారుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి తనపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు.
ప్రకాశ్గౌడ్ బీఆర్ఎస్ (BRS) నుంచి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ (Congress)లో చేరారు. అయితే ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ ఓ యువతిని ప్రేమించాడు. బీఆర్ఎస్ నాయకురాలు రూపారెడ్డి కుమార్తెను ప్రేమించి, నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. అయితే ఈ లవ్ మ్యారేజ్ ఎమ్మెల్యేకు ఇష్టం లేదని సమాచారం. దీంతో సంతోష్ గౌడ్ నెల రోజులుగా రూపారెడ్డి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో 40 మంది ఆమె ఇంటిపై దాడి చేశారు.
MLA Prakash Goud | చంపడానికి యత్నం
ఎమ్మెల్యే కుమారుడు సంతోష్ గౌడ్ మాట్లాడుతూ.. తన తండ్రి అనుచరులు తన కాబోయే భార్య ఇంటిపై దాడి చేసి, తమ ఇద్దరినీ చంపడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. “నా సొంత తండ్రి వల్లే నా ప్రాణాలకు ముప్పు ఉంది” అని ఆరోపించారు. ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని.. ఈ నేపథ్యంలో దాడి చేయించి, చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ క్షణమైనా తనను చంపే ప్రమాదం ఉందని, తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
MLA Prakash Goud | రక్షణ కల్పించాలి
రూపారెడ్డి సైతం ఈ విషయమై మాట్లాడుతూ.. తమకు పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడితో తన కుమార్తె నిశ్చితార్థం జరిగిన తర్వాత, సుమారు 40 మంది వ్యక్తులను తమ నివాసానికి పంపించారని, ఇది తమ కుటుంబ భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ విషయమై దర్యాప్తు జరపాలని కోరారు. ఈ క్లిష్ట సమయంలో బీఆర్ఎస్ నాయకత్వం తమ కుటుంబానికి అండగా నిలబడి, మద్దతును అందించాలని కోరారు. అయితే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన కుమారుడితో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Rajendranagar MLA accused by son
Rajendranagar MLA Prakash Goud has been accused of planning a violent attack on his own son, Santhosh Goud, because Santhosh wanted to marry for love against his father’s wishes.
Santhosh says his father’s supporters attacked his fiancée’s home… pic.twitter.com/aUU7zWhbui
— Hyderabad Mail (@Hyderabad_Mail) August 6, 2026
దీనిని కూడా చదవండి : Atiq Ahmed Son Death | గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడి మృతి